Monday, February 14, 2011

మార్చి 30న 'శక్తి'


చిత్ర రంగంలో 36 సంవత్సరాల ప్రస్థానం వైజయంతీ మూవీస్‌ సంస్థది. ఒక కుటుంబంలో మూడు తరాల కథానాయకులతో సినిమాలు తెరకెక్కించింది. నందమూరి తారకరామారావుతో శ్రీకారం చుట్టిన ఈ సంస్థ.. బాలకృష్ణతోనూ సినిమాలు నిర్మించింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ని 'శక్తి'గా చూపించబోతోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'శక్తి'. ఇలియానా కథానాయిక. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సి.అశ్వనీదత్‌ నిర్మాత. చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. అశ్వనీదత్‌ మాట్లాడుతూ ''మా సంస్థ అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌-మెహర్‌ రమేష్‌లతో ఇది వరకు 'కంత్రి' నిర్మించాం. ఈ కాంబినేషన్‌ని మరోసారి తెర మీదకు తీసుకురావడం ఆనందంగా ఉంది. సినిమా పేరుకు తగ్గట్టే ఎన్టీఆర్‌ శక్తి సామర్థ్యాలకు అద్దం పట్టే చిత్రమిది. కథానుసారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కీలక ఘట్టాలు తెరకెక్కించాం. విదేశాల్లోని కొన్ని అరుదైన లొకేషన్లనూ తెరపై చూపిస్తున్నాం. పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 27న పాటల్ని విడుదల చేస్తాం. ఎన్టీఆర్‌ అభిమానులకే కాదు.. సినీ ప్రియులందరికీ నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ వేసవికి 'శక్తి'తో అందరినీ రంజింపజేస్తామ''న్నారు. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...